డిగ్రీ ఆశయంతో బహ్రెయిన్ మహిళలకు వివాహం ఆలస్యం..!!
- April 04, 2025
మనామా: యూనివర్సిటీ డిగ్రీలు పొందిన బహ్రెయిన్ మహిళలు వివాహం కోసం ఎక్కువ కాలం వేచి ఉంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారి వివాహాలు ఆలస్యం అవుతున్నాయని కుటుంబ సలహాదారు సయీద్ హబీబ్ చెప్పారు. “కొంతమంది ఇప్పటికీ ప్రిన్స్ చార్మింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రపంచం ముందుకు సాగుతుంది.” అని తెలిపారు.
సామాజిక, విద్యాపరమైన కేసులపై పనిచేసే హబీబ్ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు తమ అంచనాలకు సరిపోని ప్రతిపాదనలను తిరస్కరిస్తారని అన్నారు. సమస్య విద్యాపరమైనది మాత్రమే కాదని, అందులో అనేక అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. సాధారణంగా డాక్టరేట్ ఉన్న మహిళ అదే స్థాయిలో ఉండే వ్యక్తిని కోరుకుంటుంది. అదే క్రమంలో ఆమె ఉద్యోగం కూడా గ్యాప్ ని పెంచి వివాహం అనే ప్రతిపాదన పక్కకు పోతుందన్నారు.
కుటుంబ ఖర్చు
చాలా మంది యువకులకు నెలకు BD400 కంటే తక్కువ జీతం లభిస్తుంది. ఒక వ్యక్తి ఫ్లాట్ అద్దెకు తీసుకోలేకపోతే, అతను ఎలా వివాహం చేసుకోగలడు?” అని హబీబ్ ప్రశ్నించాడు. ఈలోగా, కొంతమంది మహిళలు వారి నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యావంతులైన మహిళల్లో, వివాహం ఇకపై స్పష్టమైన సమస్యగా మారనుందని స్పష్టం చేశారు.
ఈ విషయంలో సోషల్ మీడియా పాత్ర కూడా ఉందన్నారు. ఒకప్పుడు స్థిరత్వానికి ద్వారంగా భావించిన వివాహాన్ని ఇప్పుడు కొందరు పంజరంలా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. కొంతమంది అమ్మాయిలు వివాహం వారి స్వేచ్ఛను హరించేస్తుందని నమ్మడం ప్రారంభించారని హబీబ్ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్









