GHEDEX 2025.. పాల్గొంటున్న 90 కి పైగా విద్యా సంస్థలు..!!
- April 08, 2025
మస్కట్: గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ (GHEDEX 2025) ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ ప్రదర్శన తాజా విద్యా, విద్యా కార్యక్రమాలను ప్రదర్శించడం, స్థానిక అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం ద్వారా విద్యా రంగాన్ని బలోపేత చేయడం, వివిధ రంగాలలో విద్యార్థుల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒమన్ సుల్తానేట్ తోపాటు విదేశాల నుండి 90 కి పైగా విద్యా సంస్థల పాల్గొంటున్నాయి. మూడు రోజుల కార్యక్రమాన్ని ఉన్నత విద్య, పరిశోధన , ఆవిష్కరణ మంత్రి డాక్టర్ రహమా ఇబ్రహీం అల్ మహ్రౌకి ప్రారంభించారు.
ఈ ప్రదర్శనలో స్థానిక, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పెవిలియన్, టెక్నాలజీ, వృత్తి శిక్షణ పెవిలియన్ (TRAINEX), అలాగే ప్రైవేట్, అంతర్జాతీయ బోర్డింగ్ పాఠశాలలకు అంకితమైన Edu-X పెవిలియన్, విద్యా సాంకేతికతలు వనరులలో ప్రత్యేకత కలిగిన Edu-Tech పెవిలియన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో GHEDEX కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్, ఇంటరాక్టివ్ చర్చలు, పాఠశాలలు - విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రాజెక్టులు ఉన్నాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







