విద్యార్థులను సంస్కృత భాషకు దూరం చేయకూడదు:వెంకయ్యనాయుడు
- April 11, 2025
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టే యోచన పై మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర స్పందన తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో, మాతృభాషలను పక్కన పెట్టడం మంచి అభివృద్ధి కాదని ఆయన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఇది కేవలం భాషల మధ్య ఎంపిక సమస్య మాత్రమే కాదు, మన సంస్కృతిని, మూలాలను మరచిపోయే ప్రమాదానికి నిదర్శనమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలి. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుంది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన తెలుగుభాష ప్రాముఖ్యతను కాపాడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు.… pic.twitter.com/FQnGCOkbCM
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 11, 2025
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







