సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- February 28, 2026
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక అంతర్జాతీయ సైబర్ నేరగాడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రసన్న కుమార్ అనే వ్యక్తి కంబోడియాలో ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.నిందితుడు విదేశాల నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు.
ప్రసన్నకుమార్ ఒక మ్యాట్రిమోనియర్ వెబ్ సైట్లో యువతి పేరిట నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.అలాగే నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పలువురిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ మోసం చేశాడు. ఒక బాధితుడిని నిందితుడు రూ.11 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మోసం చేయడానికి వందలాది అక్రమ సిమ్ కార్డులను సేకరించి ఫేక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద సుమారు 500 సిమ్ కార్డులు లభించాయి. అంతర్జాతీయ సైబర్ ముఠాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న పోలీసులు, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







