సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- February 28, 2026
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక అంతర్జాతీయ సైబర్ నేరగాడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రసన్న కుమార్ అనే వ్యక్తి కంబోడియాలో ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.నిందితుడు విదేశాల నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు.
ప్రసన్నకుమార్ ఒక మ్యాట్రిమోనియర్ వెబ్ సైట్లో యువతి పేరిట నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.అలాగే నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పలువురిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ మోసం చేశాడు. ఒక బాధితుడిని నిందితుడు రూ.11 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మోసం చేయడానికి వందలాది అక్రమ సిమ్ కార్డులను సేకరించి ఫేక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద సుమారు 500 సిమ్ కార్డులు లభించాయి. అంతర్జాతీయ సైబర్ ముఠాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న పోలీసులు, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









