చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బంది పై వేటు
- April 13, 2025
తిరుమల: తిరుమలలో మరోసారి భద్రతా విఫలమైందని తెలిపే ఘోర ఘటన చోటు చేసుకుంది. భక్తులు చెప్పులతోనే శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు చేరుకోవడం, ఆలయంలోకి అడుగు పెట్టే స్థితికి చేరుకోవడం టీటీడీ భద్రతాపరంగా ఎంతగా వెనుకబడ్డదనే దానికి నిదర్శనం.ఈ ఘటనపై టీటీడీ వెంటనే స్పందించినా, ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం ఎంతో పెద్దవిషయమని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్లు ఇలా అన్ని భద్రతా సరిహద్దులను దాటి, చెప్పులతోనే ఏకంగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు వచ్చేశారు. ఆలయంలోకి అడుగు పెట్టేందుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న సమయంలో టీటీడీ సిబ్బంది వారిని గుర్తించారు.వారు చెప్పులు వేసుకున్నది గమనించిన సిబ్బంది వెంటనే వారిని నిలిపివేశారు. ఆలయంలోకి చెప్పులతో వెళ్లే నిబంధన లేదని, చెప్పులు తీసేసి వెళ్లాలని సూచించడంతో ముగ్గురూ చెప్పులను అక్కడే వదిలేసి ఆలయంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ఆలయంలో, ఇటువంటి నిర్లక్ష్యంతో భక్తులు చెప్పులతోనే మహాద్వారం వరకూ చేరడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. టీటీడీ విధినిర్వహణపై ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.
ఈ ఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బందిపై చర్యల తీసుకుంది. ఏడుమందిని సస్పెండ్ చేసింది. మరో ఆరుమందిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించింది. ఆయా ఉద్యోగుల పేర్లు, పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన వివరించింది. ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపారు. సస్పెండ్ అయిన వారిలో చక్రపాణి- సీనియర్ అసిస్టెంట్, వాసు- జూనియర్ అసిస్టెంట్, టీటీడీ భద్రతా సిబ్బంది- డీ బాలకృష్ణ (పీఎస్జీ 0807), వసుమతి (సీడబ్ల్యూపీఎస్జీ 514067), టీ రాజేష్ కుమార్ (ఏడబ్ల్యూపీఓ 512475), కే వెంకటేష్ (పీఎస్జీ 932), ఎం బాబు (ఏడబ్ల్యూపీఓ) ఉన్నారు. సస్పెన్షన్కు సిఫారసు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది- సీ రమణయ్య (ఇన్ఛార్జ్ ఏఎస్ఐ 1101), బీ నీలబాబు (సీటీ 3595), డీఎస్కే ప్రసన్న (సీటీ 3602), సత్యనారాయణ (ఏఎస్ఐ 696), పోలి నాయుడు (సీటీ 3516), ఎస్ శ్రీకాంత్ ఉన్నారు. తిరుమలలో జరుగుతున్న ఈవిధమైన సంఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. టీటీడీ పాలకమండలి, అధికారులు మరింతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..







