గల్ఫ్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి అందుబాటులోకి బాడీ ఫ్రీజర్
- April 13, 2025
తెలంగాణ: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంపెల్లి వెంకట్రావుపేట్ గ్రామాలకు చెందిన వివి రావుపేట్ గల్ఫ్ సంఘసభ్యులు,గల్ఫ్ కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలతో ఆదివారం స్థానిక పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
రెండు గ్రామాలకు సేవ చేయడానికి ఈ వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం ఏర్పడిందని, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకి ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతే కన్నవారి కుటుంబ సభ్యుల కడచారి చూపు చూసుకోవాలనీ గల్ఫ్ కార్మికుల అందరినిర్ణయం ప్రకారం డెడ్ బాడీ ఫ్రీజర్ ను గల్ఫ్ వి. వి.రావుపేట్ సంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు నేటి నుండి బాడీ ప్రీజర్ అందుబాటులో ఉంటుందని గల్ఫ్ సంఘ నాయకులు ఈ మీటింగ్ నందు నిర్ణయం తీసుకోన్నారు.అలాగే గతంలో కూడాగల్ఫ్ కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతోమందికి సహాయం చేశామని,మున్ముందు మరిన్ని సేవ కార్యక్రమలు,సహాయాలు చేయడానికి ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు.భవిష్యత్తులో పరాయి దేశంలో ఉన్నటువంటి ఒక్క గల్ఫ్ కార్మికుని కూడాఏ ఆపద వచ్చిన కూడా వారి కుటుంబ సభ్యులకు ఈ సంఘం వారికి భరోసాగా ఉంటుందని,గ్రామ అభివృద్ధి మరియు గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కావలసినటువంటి ఉపాధి లేక ఏదైనా శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సంఘం పలు సేవలు చేస్తున్నది అంటే కన్న ఊరు మీద ప్రేమ మరియు సేవాభావం ఉన్నవారే ముందుండి కలసి కట్టుగా నడిపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసారు.సంఘం నిర్మాణంకి, బాడీ ఫ్రిజర్కి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు, నాయకులు.గల్ఫ్ సంఘo అధ్యక్షులు పెనుకుల అశోక్, నిర్వాహకులు నలిమెల్ ప్రసాద్, అరెల్లి మహేష్, Bl.నారాయణ గౌడ్, పోతు రఘు, గుగ్లావత్ శ్రీకాంత్,శ్రీను,మాచర్ల రఘుపతి,శ్రీమాన్,రవీందర్ చారి, రోడ్డు రాజశేఖర్,వేల్పుల రాజేందర్.కండేలా వేంకటి. ఆకుల సతీష్. K.విశాల్, G.శ్రీనివాస్,మల్లేష్, నరేందర్, తిరుపతిబాపు.అన్నపు వెంకటేష్,మల్లేష్ సౌదీ.M.అది రెడ్డి, Md.హబ్బీ.భూమేశ్వర్,j. చంద్రయ్య, Md.రహేమ్,మేడపట్ల రాజేష్, మెండే ప్రవీణ్.పెనుకుల నరేష్, దబడి రవి, వేల్పుల మహేష్, సంద స్వామి.నాయకులు బిట్ల నరేష్, కొడిమ్యాల రవి,మచర్ల దశ రెడ్డి, రాజేందర్. మీనుగు చందు, బైన ప్రశాంత్, నూనె వంశీ. వేముల నరేష్,Dr.శేఖర్. ANM కోమల,మానస. సుజాత, సుమ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









