భారత్‌ రంగంలోకి దిగింది...

- July 07, 2016 , by Maagulf
భారత్‌ రంగంలోకి దిగింది...

క ఉగ్రదాడిని మరువకముందే రంజాన్‌ రోజున మరోసారి బాంబు పేలుడుతో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా దద్దరిల్లింది. ఐఎస్‌ సృష్టిస్తున్న వరుస ఉగ్రచర్యలను పరిశీలించేందుకు భారత్‌ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా జాతీయ రక్షక దళ(ఎన్‌ఎస్‌జీ) బృందాన్ని బంగ్లాదేశ్‌ పంపేందుకు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అనుమతులను కూడా పూర్తయ్యాయి. బంగ్లాదేశ్‌ వెళ్లే ఎన్‌ఎస్‌జీ బృందం అక్కడ పరిస్థితులను విశ్లేషించి అధ్యయనం చేయనుంది.
'ఎన్‌ఎస్‌జీ బృందం బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు ఆ దేశం నుంచి అనుమతి లభించింది. వరుస ఉదంతాలను, అక్కడ నెలకొన్న పరిస్థితులను వీరు అధ్యయనం చేస్తారు.' అని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రీ బంధం.. సహకారం నేపథ్యంలో బంగ్లాదేశ్‌ కూడా ఎన్‌ఎస్‌జీ బృందం తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com