బీఆర్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, సీఎం లు
- April 14, 2025
న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశమంతటా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు, నాయకులు, ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ హృదయపూర్వకంగా నివాళులర్పించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









