బీఆర్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, సీఎం లు
- April 14, 2025
న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశమంతటా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు, నాయకులు, ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ హృదయపూర్వకంగా నివాళులర్పించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!