మక్కాలోని హాస్పిటాలిటీ సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ కీలక సర్క్యులర్..!!
- April 14, 2025
రియాద్: హజ్ సీజన్లో హజ్ పర్మిట్ లేదా నగరంలో పని చేయడానికి లేదా బస చేయడానికి అధికారిక ప్రవేశ అనుమతి లేని వారికి వసతి కల్పించవద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ మక్కాలోని అన్ని హాస్పిటాలిటీ సంస్థలను ఆదేశించింది. ఈ ఆదేశం 2025 ఏప్రిల్ 29కి అనుగుణంగా ధుల్ ఖాదా 1, 1446 నుండి అమలులోకి వస్తుందని, హజ్ సీజన్ ముగిసే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సురక్షితంగా, శాంతియుతంగా హజ్ యాత్రను నిర్వహించగలరని నిర్ధారించడం లక్ష్యంగా ఏర్పాట్లు, విధానాలకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ ఇటీవల చేసిన సూచనతో ఈ మేరకు ప్రకటించారు. ఏప్రిల్ 29నాటికి, హజ్ వీసా కాకుండా వేరే ఏ రకమైన వీసా కలిగి ఉన్న వ్యక్తులు మక్కాలో ప్రవేశించడానికి లేదా ఉండటానికి అనుమతించబడరని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









