అబుదాబిలో E311 కనీస వేగ పరిమితి ఎత్తివేత..!!
- April 14, 2025
యూఏఈ: అబుదాబిలో ట్రాఫిక్ భద్రతను పెంచడంతోపాటు భారీ ట్రక్కులకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. సంస్కరణల్లో భాగంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్ (E311)లో కనీస వేగ పరిమితి వ్యవస్థను 120kmph ఎత్తివేయనున్నట్లు అబుదాబి ప్రకటించింది. ఇకపై వాహనదారులు 120kmph కనీస వేగానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అబుదాబి ప్రకటించింది.ఈ మార్పు అన్ని వాహనాలకు వర్తిస్తుందని, ముఖ్యంగా పెద్ద వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించే వారికి మెరుగైన, సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 2023లో అబుదాబి E311లో కనీస వేగ పరిమితిని 120kmphగా నిర్ణయించారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం 140kmph, ఎడమ నుండి మొదటి, రెండవ లేన్లలో కనిష్ట వేగం 120kmphగా ఉంది. కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన డ్రైవర్లకు జరిమానా కింద Dh400 జరిమానా విధించబడుతుంది. అలాగే నెమ్మదిగా డ్రైవింగ్ చేసినా జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







