ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఐసిస్ సానుభూతిపరులతో కుటుంబసభ్యులు
- July 07, 2016
నగరంలో దాడులకు కుట్ర పన్ని పట్టుబడ్డ ఐసిస్ సానుభూతిపరులకు.. రంజాన్ సందర్భంగా వారి కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు. నాంపల్లి కోర్టు అనుమతితో ప్రస్తుతం ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. రంజాన్ సందర్భంగా గురువారం విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. యువకులకు చెందిన కుటుంబసభ్యులు ఇద్దరేసి వంతున కలిసేందుకు అనుమతి ఇచ్చారు. రంజాన్ కావడంతో ఆ యువకుల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అయితే కుటుంబసభ్యులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను మాత్రం అనుమతించలేదు. యువకులు కోరిన ఆహార పదార్ధాలను తామే తయారుచేయించినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వారి విచారణ యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







