సాదియత్ నుండి అబుదాబి విమానాశ్రయానికి ఉచిత డ్రైవర్లెస్ టాక్సీ సేవలు..!!
- April 18, 2025
యూఏఈ: అబుదాబిలోని ప్రయాణికులు ఇప్పుడు యాస్ ద్వీపంలోని సాదియత్ నుండి డ్రైవర్లెస్ టాక్సీలో జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. మొదటగా యాస్, సాదియత్ దీవులలో ప్రారంభమైన ఈ సేవ, ఇప్పుడు రాజధానిలోని కీలక ప్రదేశానికి చేరుకుంది.
"యాస్ ద్వీపం నుండి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటోమెటెడ్ వాహన సేవ విస్తరణ అబుదాబి మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అధునాతన సాంకేతికతలను రవాణా వ్యవస్థలో అనుసంధానించడంలో ఇది కీలకంగా మారుతుంది." అని అబుదాబిలోని ఆటోమెటెడ్ వాహన రవాణా సేవ విస్తరణ ఫాతిమా అల్ హంటౌబి అన్నారు.
2021 లో ప్రారంభించినప్పటి నుండి ఆటోమెటెడ్ వాహన సేలలు ఇప్పటివరకు 30వేల ట్రిప్పులను పూర్తి చేసిందని, 430,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని వివరించారు. పైలట్ దశలో భాగంగా భద్రతా నిర్వాహకులు ఉంటారని ఫాతిమా అన్నారు. థాయ్ యాప్ ద్వారా ప్రయాణీకులు రైడ్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. రాజధానిలో ఇప్పుడు దాదాపు 18 ఆటోమెటెడ్ టాక్సీలు పనిచేస్తున్నాయని, ఇవి యాస్ ద్వీపం, సాదియత్ ద్వీపం, ఇప్పుడు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







