చెక్కు ఫోర్జరీ..బాధితుడికి QR2 మిలియన్ పరిహారం..!!
- April 28, 2025
దోహా, ఖతార్: ఖతార్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ చెక్ ఫోర్జరీ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గ్యారెంటీ చెక్కును మోసపూరితంగా మార్చిన వారికి జైలు శిక్ష, జరిమానాతోపాటు ప్రయాణ నిషేధం, QR 2 మిలియన్ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం,.. బాధితుడు తన మాజీ బిజినెస్ పార్టనర్, స్నేహితుడి వాహనం కొనుగోలుకు QR 162,000 రుణ మొత్తానికి ఫైనాన్సింగ్ కంపెనీకి హామీదారుగా ఉన్నాడు. హామీగా, బాధితుడు తన స్నేహితుడికి ఖాళీ చెక్కును ఇచ్చాడు. అయితే, 10 సంవత్సరాల తరువాత, బాధితుడు తన మాజీ స్నేహితుడు QR 28.5 మిలియన్ల చెక్కు మోసం చేసాడని అరెస్ట్ వారెంట్ జారీ చేయించాడు. అయితే, విచారణ అధికారులు తమ విచారణలో నిజాన్ని తెలుసుకున్నారు. దాంతో కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మిస్డిమీనర్స్ అండ్ ఫెలోనీస్ 3 సంవత్సరాల జైలు శిక్ష, ప్రయాణ నిషేధం, QR 100,000 ఫైన్ విధించింది. చెక్కులతో లేదా ఏదైనా ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు సూచించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









