చెక్కు ఫోర్జరీ..బాధితుడికి QR2 మిలియన్ పరిహారం..!!
- April 28, 2025
దోహా, ఖతార్: ఖతార్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ చెక్ ఫోర్జరీ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గ్యారెంటీ చెక్కును మోసపూరితంగా మార్చిన వారికి జైలు శిక్ష, జరిమానాతోపాటు ప్రయాణ నిషేధం, QR 2 మిలియన్ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం,.. బాధితుడు తన మాజీ బిజినెస్ పార్టనర్, స్నేహితుడి వాహనం కొనుగోలుకు QR 162,000 రుణ మొత్తానికి ఫైనాన్సింగ్ కంపెనీకి హామీదారుగా ఉన్నాడు. హామీగా, బాధితుడు తన స్నేహితుడికి ఖాళీ చెక్కును ఇచ్చాడు. అయితే, 10 సంవత్సరాల తరువాత, బాధితుడు తన మాజీ స్నేహితుడు QR 28.5 మిలియన్ల చెక్కు మోసం చేసాడని అరెస్ట్ వారెంట్ జారీ చేయించాడు. అయితే, విచారణ అధికారులు తమ విచారణలో నిజాన్ని తెలుసుకున్నారు. దాంతో కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మిస్డిమీనర్స్ అండ్ ఫెలోనీస్ 3 సంవత్సరాల జైలు శిక్ష, ప్రయాణ నిషేధం, QR 100,000 ఫైన్ విధించింది. చెక్కులతో లేదా ఏదైనా ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు సూచించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







