కాజూ వీరు అస్సలు తినకూడదా?

- April 28, 2025 , by Maagulf
కాజూ వీరు అస్సలు తినకూడదా?

జీడి పప్పు...ఇవి రుచిలో కాస్త తీపిగా ఉంటాయి.ఆరోగ్యంగా ఉన్న వాళ్లు తీసుకుంటే పర్లేదు.మరి డయాబెటిక్ పేషెంట్స్ సంగతేంటి.కాజూ ఎక్కువగా తీసుకుంటే వాళ్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయా.డయాబెటిస్ ఉన్న వాళ్లు కాజు తినకూడదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే..ఈ ప్రశ్నలకు కొంత మంది డైటీషియన్లు సమాధానం ఇస్తున్నారు.డయాబెటిక్ పేషెంట్స్ కాజూ నట్స్ తీసుకుంటే ఏమవుతుంది.ఎంత తీసుకుంటే సేఫ్ గా ఉండొచ్చు అన్నది వివరిస్తున్నారు.

రోజూ ఉదయం తీసుకునే నట్స్‌లో జీడిపప్పుని చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. అందుకు కారణం అందులో ఉండే పోషకాలు. ప్రోటీన్‌తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాదు. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అందుకే డైట్‌లో ఇవి తప్పని సరిగా ఉండాలని అంటారు.

అయితే..రోజూ ఉదయమే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయా అన్నదే అందరికీ వస్తున్న డౌట్. ఉదయం సుమారుగా ఓ 75 గ్రాముల కాజూ తింటే షుగర్ లెవెల్స్ కాస్తంత పెరిగే అవకాశముందని చెబుతున్నారు డైటీషియన్స్. 75 గ్రాముల జీడిపప్పులో 20 గ్రాముల మేర కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. దీంతో పాటు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

ఇప్పుడు చెప్పినట్టుగా 75 గ్రాముల కాజూ తీసుకున్నా అందులో ఉండే కార్బొహైడ్రేట్స్ తక్కువే. అయితే కేలరీల పరంగా చూస్తే కాజూలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ఉండే ఒలెయిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తాయి. ఈ యాసిడ్స్‌లో యాంటీ డయాబెటిక్ తో పాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి.

పైగా ఇవి గుండెకి ఏ మాత్రం హాని చేయని ఎల్ డీఎల్ అంటే మంచి కొవ్వుని పెంచుతాయి. ఇక స్టీరిక్ యాసిడ్ కూడా కిడ్నీలకు మంచి చేస్తాయి. లిపిడ్ ప్రొఫైల్ బాగుందంటే డయాబెటిస్ ఆటోమెటిక్ గా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. అందుకే జీడి పప్పు తీసుకున్నప్పటికీ డయాబెటిస్ పేషెంట్స్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఉండవు. బ్రెడ్, పాస్తా లాంటివి తీసుకుంటే మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి.

జీడిపప్పులో ప్రొటీన్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అయితే..ఈ రెండూ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సరైన విధంగా బ్యాలెన్స్ చేస్తాయని చెబుతున్నారు డైటీషియన్స్. అందుకు కారణం ఏంటంటే ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అంటే ఎక్కువ సేపు పొట్ట నిండినట్టుగానే అనిపిస్తుంది. ఆకలి కూడా తగ్గుతుంది. ఫలితంగా ఏది పడితే అది తినడం ఆపేస్తారు. ఫలితంగా మెటబాలిజం కంట్రోల్ తప్పకుండా ఉంటుంది.

ఈ నట్స్ లో మెగ్నీషియం ఉంటుంది. గ్లూకోజ్ మెటబాలిజం కంట్రోల్ లో ఉండడానికి ఇది చాలా అవసరం. అంతే కాదు. ఇన్సులిన్ సరైన విధంగా పని చేసేలా చూస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ని శరీరం కరెక్ట్ గా వాడుకునే లా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. జీడిపప్పుకి సంబంధించి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే ఇవి తిన్నా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు అని అర్థం. డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

జీడిపప్పు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ..వాటిని ఎంత తింటున్నామన్నది గమనించుకోవాలి. మరీ అతిగా తింటే సమస్యలు తప్పవు. ఇలా ఎక్కువగా తిన్నప్పుడు వెంటనే ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. అయితే..ఇది క్రమంగా శరీరంలో కేలరీలు పెంచి బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. ఒకవేళ కాజూని ఎక్కువగా తీసుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేసేలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

వెజిటబుల్ సలాడ్ లేదా యోగర్ట్ లాంటివి తింటే ఇబ్బంది ఉండదు. వీటితో పాటు పండ్లు కూరగాయలు క్రమంగా తప్పకుండా తీసుకోవాలి. పండ్లను రోజువారీ డైట్ లో చేర్చుకోవాలి. వ్యాయామం చేయడం తప్పనిసరి. వాకింగ్, జాగింగ్ లాంటి సులువైన వ్యాయామాలతో బాడీ ఫిట్ గా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com