బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- October 19, 2025
దుబాయ్: దుబాయ్ లో ఇటీవల దయ్యం బొమ్మలను కాల్చే ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవ్ అవుతోంది. దీనిపై దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయని, ప్లాస్టిక్, ఫాబ్రిక్ లేదా సింథటిక్ జుట్టు వంటి మండే పదార్థాలను కాల్చడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, అలాగే విషపూరితమైన పొగ విడుదల అవుతుందని, దీనిని పీల్చడం ద్వారా మనుషులలో తీవ్రమైన పరిణామాలకు దారీతీయవచ్చని పోలీసులు తెలిపారు.
పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనించాలని, అలాంటి నివీడియోల ద్వారా జరిగే ప్రమాదాల గురించి వారితో మాట్లాడాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ప్రమాదకరమైన కంటెంట్ను షేర్ చేయడం అనేది యూఏఈలో చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, ఎందుకంటే ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి హాని కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







