బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- October 19, 2025
దుబాయ్: దుబాయ్ లో ఇటీవల దయ్యం బొమ్మలను కాల్చే ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవ్ అవుతోంది. దీనిపై దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయని, ప్లాస్టిక్, ఫాబ్రిక్ లేదా సింథటిక్ జుట్టు వంటి మండే పదార్థాలను కాల్చడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, అలాగే విషపూరితమైన పొగ విడుదల అవుతుందని, దీనిని పీల్చడం ద్వారా మనుషులలో తీవ్రమైన పరిణామాలకు దారీతీయవచ్చని పోలీసులు తెలిపారు.
పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనించాలని, అలాంటి నివీడియోల ద్వారా జరిగే ప్రమాదాల గురించి వారితో మాట్లాడాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ప్రమాదకరమైన కంటెంట్ను షేర్ చేయడం అనేది యూఏఈలో చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, ఎందుకంటే ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి హాని కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







