బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- October 19, 2025
దుబాయ్: దుబాయ్ లో ఇటీవల దయ్యం బొమ్మలను కాల్చే ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవ్ అవుతోంది. దీనిపై దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయని, ప్లాస్టిక్, ఫాబ్రిక్ లేదా సింథటిక్ జుట్టు వంటి మండే పదార్థాలను కాల్చడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, అలాగే విషపూరితమైన పొగ విడుదల అవుతుందని, దీనిని పీల్చడం ద్వారా మనుషులలో తీవ్రమైన పరిణామాలకు దారీతీయవచ్చని పోలీసులు తెలిపారు.
పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనించాలని, అలాంటి నివీడియోల ద్వారా జరిగే ప్రమాదాల గురించి వారితో మాట్లాడాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ప్రమాదకరమైన కంటెంట్ను షేర్ చేయడం అనేది యూఏఈలో చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, ఎందుకంటే ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి హాని కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









