ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- October 19, 2025
బెర్లిన్: జర్మనీలోని ఖతార్ రాయబార కార్యాలయంలో “బిల్డింగ్ బ్రిడ్జెస్: ఖతార్ అండ్ జర్మనీ ఇన్ డైలాగ్ ఫర్ టాలరెన్స్, పీస్ అండ్ సాలిడారిటీ” అనే సింపోజియం జరిగింది. ఇందులో ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) సెక్రటరీ జనరల్ డాక్టర్ అహ్మద్ బిన్ హసన్ అల్ హమ్మది, జర్మన్ పార్లమెంట్ సభ్యుడు మరియు బెర్లిన్ మాజీ మేయర్ మైఖేల్ ముల్లర్ పాల్గొన్నారు. వీరితోపాటు రెండు దేశాలకు చెందిన మేధావులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు.
ఒకరినొకరు తెలుసుకోవటానికి, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడానికి మరియు అంతర్జాతీయ శాంతిని సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అల్ హమ్మది అన్నారు. ఈ సందర్భంగా 2025-2026లో ఖతార్ గ్లోబల్ అవార్డు ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్ ఐదవ ఎడిషన్ను ప్రారంభించినట్లు ప్రకటించారు.
అనంతరం బెర్లిన్లో జర్మనీ ఫెడరల్ విదేశాంగ కార్యాలయ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ గెజా ఆండ్రియాస్ వాన్ గేయర్తో సమావేశమయ్యారు. వారు రెండు దేశాల మధ్య సహకారం మరియు సంబంధాలు, పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జర్మనీలోని ఖతార్ రాయబారి అబ్దుల్లా బిన్ ఇబ్రహీం అల్ హమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







