బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- October 19, 2025
మనామా: బహ్రెయిన్ లో అధికారిక సంస్థల పేరిట టెక్స్ట్ మెసేజ్ల ద్వారా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జాతీయ సైబర్ భద్రతా కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. స్కామర్లు ఫీజులు చెల్లించేలా లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించి మోసగిస్తున్నట్లు నివేదించారు.
ఈ మోసపూరిత మెసేజులు తరచుగా అధికారిక వెబ్సైట్లను పోలి ఉండేలా రూపొందించే నకిలీ లింక్లను కలిగి ఉంటాయని, ఇవి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా బ్యాంక్ ఖాతాల సమాచారం సేకరణ లక్ష్యంగా ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరవని జాతీయ సైబర్ భద్రతా కేంద్రం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







