బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!

- October 19, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!

మనామా: బహ్రెయిన్ లో అధికారిక సంస్థల పేరిట టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జాతీయ సైబర్ భద్రతా కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. స్కామర్లు ఫీజులు చెల్లించేలా లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించి మోసగిస్తున్నట్లు నివేదించారు. 

ఈ మోసపూరిత మెసేజులు తరచుగా అధికారిక వెబ్‌సైట్‌లను పోలి ఉండేలా రూపొందించే  నకిలీ లింక్‌లను కలిగి ఉంటాయని, ఇవి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా బ్యాంక్ ఖాతాల సమాచారం సేకరణ లక్ష్యంగా ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరవని జాతీయ సైబర్ భద్రతా కేంద్రం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com