బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- October 19, 2025
మనామా: బహ్రెయిన్ లో అధికారిక సంస్థల పేరిట టెక్స్ట్ మెసేజ్ల ద్వారా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జాతీయ సైబర్ భద్రతా కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. స్కామర్లు ఫీజులు చెల్లించేలా లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించి మోసగిస్తున్నట్లు నివేదించారు.
ఈ మోసపూరిత మెసేజులు తరచుగా అధికారిక వెబ్సైట్లను పోలి ఉండేలా రూపొందించే నకిలీ లింక్లను కలిగి ఉంటాయని, ఇవి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా బ్యాంక్ ఖాతాల సమాచారం సేకరణ లక్ష్యంగా ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరవని జాతీయ సైబర్ భద్రతా కేంద్రం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







