యూఏఈ రోడ్డు ప్రమాదంలో 15ఏళ్ళ యువకుడి మృతి
- July 08, 2016
ఎమిరేటీ టీనేజర్ మరో ఇద్దరు ఆసియాకి చెందిన వ్యక్తులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. రస్ అల్ ఖైమాలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 15 ఏళ్ళ వ్యక్తి వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందిందనీ, వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నామని, ప్రమాదంలో వాహనం దగ్ధమై ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. సకాలంలో రెస్క్యూ వాహనాలు ప్రమాద స్థలికి చేరుకున్నా, ప్రమాద తీవ్రత దృష్ట్యా అప్పటికే ఆ యువకుడి ప్రాణం పోయిందని ఆయన వివరించారు. మరో ప్రమాదంలో, ముగ్గురు ఆసియన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వాహనం లోయలోకి పడిపోయింది. ప్రమాద స్థలంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించి వాహనాలు నడపడం ద్వారా మాత్రమే ప్రమాదాలు నివారించవచ్చని బ్రిగేడియర్ హుమైది చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







