యూఏఈ రోడ్డు ప్రమాదంలో 15ఏళ్ళ యువకుడి మృతి

- July 08, 2016 , by Maagulf
యూఏఈ రోడ్డు ప్రమాదంలో 15ఏళ్ళ యువకుడి మృతి

ఎమిరేటీ టీనేజర్ మరో ఇద్దరు ఆసియాకి చెందిన వ్యక్తులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. రస్ అల్ ఖైమాలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 15 ఏళ్ళ వ్యక్తి వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందిందనీ, వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నామని, ప్రమాదంలో వాహనం దగ్ధమై ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. సకాలంలో రెస్క్యూ వాహనాలు ప్రమాద స్థలికి చేరుకున్నా, ప్రమాద తీవ్రత దృష్ట్యా అప్పటికే ఆ యువకుడి ప్రాణం పోయిందని ఆయన వివరించారు. మరో ప్రమాదంలో, ముగ్గురు ఆసియన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వాహనం లోయలోకి పడిపోయింది. ప్రమాద స్థలంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించి వాహనాలు నడపడం ద్వారా మాత్రమే ప్రమాదాలు నివారించవచ్చని బ్రిగేడియర్ హుమైది చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com