అజ్మాన్, షార్జాల్లో ఫేక్ మొబైల్ మార్కెట్స్
- July 08, 2016
అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా షార్జా, అజ్మాన్లో నకిలీ మొబైల్ ఫోన్ల అమ్మకాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి మొబైల్స్ని కొనుగోలు చేస్తున్నవారిలో ఎక్కువమంది వలసదారులే ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో అమ్మకందారులు, వినియోగదారులకు ఫేక్ మొబైల్స్ని అంటగడుతున్నారు. బ్లాక్బెర్రీ ఫోన్లు, ట్యాబ్లెట్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్లు నమ్మశక్యం కాని ధరల్లో, అంటే 50 నుంచి 200 దిర్హామ్లలోపే దొరుకుతున్నాయి. అయితే కొనుగోలు చేశాక వినియోగదారులకి అవి డూప్లికేట్ అని అర్థమవుతోంది. అయినప్పటికీ అవి అచ్చం ఒరిజినల్ని పోలి ఉండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డూప్లికేట్ ఫోన్లలో చాలావరకు చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఎకనమిక్ డిపార్ట్మెంట్ మరియు కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ డూప్లికేట్ మొబైల్ మార్కెట్పై దాడులు నిర్వహిస్తున్నా ఫలితం ఉండటంలేదు. గత ఆరు నెలలుగా నిరంతరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈద్ సందర్భంగా ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నారు. డూప్లికేట్ మార్కెట్ని అడ్డుకునేందుకు ఇంకా సమర్థవంతమైన దాడుల్ని కొనసాగించాల్సి ఉంటుందని, దేశంలోకి అవి ప్రవేశించకుండా అడ్డుకోవడమొక్కటే ఈ మార్కెట్ని అంతమొందించడానికి ఉన్న అవకాశమని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







