రబ్ అల్-ఖలీ బార్డర్ ను సందర్శించిన సౌదీ, ఒమన్ విదేశాంగ మంత్రులు..!!
- April 29, 2025
జెబెల్ అఖ్దర్: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సోమవారం ఒమన్లోని జెబెల్ అఖ్దర్ ప్రాంతంలో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ బిన్ హమూద్ అల్బుసైదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఇరువురు రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను సమీక్షించారు. వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వాటిని పరిష్కరించడానికి తీసుకున్న ప్రయత్నాలను కూడా వారు సమీక్షించారు.
అనంతరం ఇద్దరు మంత్రులు సౌదీ అరేబియా- ఒమన్లను కలిపే రబ్ అల్-ఖలీ సరిహద్దు క్రాసింగ్ను సందర్శించారు. అక్కడ వారు ప్రయాణీకుల ప్రాసెసింగ్ హాళ్లు, రెండు దేశాల మధ్య ప్రయాణం, వాణిజ్య మార్పిడి, సదుపాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో లాజిస్టికల్, పరిపాలనా సేవలతో సహా ఆధునిక సౌకర్యాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఒమన్లోని సౌదీ రాయబారి ఇబ్రహీం బిన్ బిషన్, విదేశాంగ మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ వలీద్ అల్-ఇస్మాయిల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









