నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్‌లోనా? షెడ్యూల్‌ పై క్లారిటీ

- February 17, 2026 , by Maagulf
నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్‌లోనా? షెడ్యూల్‌ పై క్లారిటీ

న్యూ ఢిల్లీ: ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక అప్‌డేట్ వెలువడింది. ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మధ్య నాటికి ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

ఎన్నికల సన్నద్ధతలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్రాల పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం వారు అస్సాంలో పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం వంటి అంశాలను సమీక్షిస్తున్నారు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ మరియు అస్సాం అసెంబ్లీల పదవీకాలం మే నెలలో ముగియనుండగా, పుదుచ్చేరి అసెంబ్లీ పదవీకాలం జూన్ 15న ముగియనుంది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పుదుచ్చేరిలో తుది ఓటరు జాబితా ఫిబ్రవరి 14న విడుదల కాగా, మిగిలిన రాష్ట్రాల జాబితాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రచార కార్యక్రమాలు వేగం అందుకునే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com