ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- February 17, 2026
హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని తన పాస్పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రవి ఇంటర్నెట్ వినియోగం పై కోర్టు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీనితో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ, ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









