ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- February 17, 2026
హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని తన పాస్పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రవి ఇంటర్నెట్ వినియోగం పై కోర్టు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీనితో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ, ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









