ఒమన్ $565 మిలియన్లతో సౌర తయారీ ప్లాంట్..!
- April 29, 2025
మస్కట్: సోహార్ ఫ్రీజోన్లో అత్యాధునిక సౌర తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి $565 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఒమన్ తన పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించే దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. మస్కట్లో జరిగిన అడ్వాంటేజ్ ఒమన్ ఫోరం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఒమన్ విజన్ 2040 కింద క్లీన్ ఎనర్జీ, పారిశ్రామిక వైవిధ్యీకరణకు సుల్తానేట్ నిబద్ధతను తెలియజేశారు.
ప్రపంచంలోని టాప్ నాలుగు అధిక సామర్థ్యం గల సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీదారులు , సరఫరాదారులలో ఒకటైన JA సోలార్ ఎనర్జీ, ఇన్వెస్ట్ ఒమన్, సోహార్ పోర్ట్ , ఫ్రీజోన్, మాజిస్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ వంటి కీలకమైన ఒమానీ సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇది 6 గిగావాట్ల సోలార్ సెల్స్, 3 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది యూరప్, యునైటెడ్ స్టేట్స్, ఈ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్లకు సేవలు అందిస్తుందని వాణిజ్యం, పరిశ్రమ, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇబ్టిసామ్ అల్ ఫరూజీ తెలిపారు. దీని ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఒమన్ క్లీన్ ఎనర్జీ పాలసీని ముందుకు తీసుకెళ్లడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







