17వ జాతీయ సైంటిఫిక్ పరిశోధన, ఇన్నోవేషన్ ప్రదర్శన ప్రారంభం..!!
- April 29, 2025
దోహా, ఖతార్: విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఖతార్ ఆధ్వర్యంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ మండలి (QRDI) సహకారంతో నిర్వహిస్తున్న 17వ జాతీయ శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ ప్రదర్శన 2025, ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అధికారికంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు జరిగే ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సైంటిఫిక్ పరిశోధన నిపుణులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవంలో MOEHEలోని విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మహా జాయెద్ అల్ రువైలి, QRDI సెక్రటరీ జనరల్ ఇంజనీర్ ఒమర్ అల్ అన్సారీతో పాటు అనేక మంది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వారితోపాటు కౌన్సిల్ ప్రతినిధులు, విద్యార్థి పరిశోధకులు, పర్యవేక్షకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరుస్తాయని , వారి దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే వినూత్న శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించడానికి వారికి అవకాశాలను అందిస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైన్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్ డిజైన్లో 104 పరిశోధన ప్రాజెక్టులను ప్రవేశపెడుతుండగా.. మిడిల్ -సెకండరీ పాఠశాల విద్యార్థులు కంప్యూటింగ్, ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రం, శక్తి, బయోమెడిసిన్, పర్యావరణ శాస్త్రాలతో సహా ఎనిమిది అధునాతన శాస్త్రీయ రంగాలలో 150 పరిశోధనా పత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా 33 విధానపరమైన పరిశోధనా పత్రాలతో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







