కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్
- May 01, 2025
తిరుమల: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి పుణ్యక్షేత్రంలో బుధవారం జరిగిన కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు హాజరయ్యారు.
అన్నవరానికి చెందిన దుడ్డు సుబ్రహ్మణ్య గణేష శర్మ కు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సన్యాస దీక్షను అనుగ్రహించి శిష్య స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఉత్తరాధికారిగా నియమితులైన వేదపండితోత్తమ గణేష్ శర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం చేశారు.
ఈ వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్ పీఠాధిపతి, ఉత్తరాధికారులకు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి టీటీడీ చైర్మన్ తో మాట్లాడుతూ తిరుమలతో కంచి పీఠానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ధార్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, టీటీడీ తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా తమ పీఠాన్ని సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం చైర్మన్ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామ కృష్ణ, బొక్కసం ఇన్ ఛార్జ్ గురు రాజ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







