'రాజమౌళి'ని ప్రశంసలతో ముంచిన 'వర్మ'
- July 13, 2015
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేశారు. ఇక ఏ సినిమా అయిన దీని తర్వాతే అని వ్యాఖ్యానించారు. హీరో కంటే కథే గొప్ప అని ఈ చిత్రం రుజువు చేసిందని, ఈ విషయాన్ని హాలీవుడ్ దశాబ్దాల క్రితమే గుర్తించిందని పేర్కొన్నారు. తామే గొప్పవాళ్లమని విర్రవీగుతున్న హీరోలకు 'బాహుబలి' మేలుకొలుపు అన్నారు. సింహాలు, పులులు, ఏనుగులు, కొండచిలువలతో నిండివున్న ఇండస్ట్రీ జంగిల్ లోకి బాహుబలి డైనోసార్ వచ్చిందని... అంతకుముందున్న పాలన మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రభాస్ టెరిఫిక్ గా చేశాడని ప్రశంసించారు. దగ్గుబాటి రానా అయితే ఫిజికల్ గా, పెఫ్మార్ మెన్స్ పరంగా శిఖర స్థాయిని అందుకున్నాడని ఆకాశానికెత్తారు. రమ్యకృష్ణ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నారు. 'బాహుబలి' తర్వాత వచ్చే పెద్ద హీరోల సినిమా 5డీలో చూడాల్సివుంటుందన్నారు. రాజమౌళి ఇక్కడకు పుట్టినందుకు తెలుగువారు గర్వపడక్కర్లేదని.. బాంబే లేదా లాస్ ఏంజెలెస్ లో పుట్టకపోవడం అతడి దురదృష్టమని ట్విటర్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







