ఖరీఫ్ సీజన్ కోసం రోజుకు 12 విమానాలు..ఒమన్ ఎయిర్ సామర్థ్యం పెంపు..!!
- May 07, 2025
మస్కట్: దేశీయ పర్యాటకానికి మద్దతు ఇవ్వడంలో తన నిబద్ధతను బలోపేతం చేస్తూ, రాబోయే ఖరీఫ్ ధోఫర్ కోసం సామర్థ్యంలో పెరుగుదలను ఒమన్ ఎయిర్ ప్రకటించింది. జూలై 1 నుండి ఎయిర్లైన్ మస్కట్, సలాలా మధ్య రోజుకు 12 విమానాలను నడుపనుంది. ఈ ప్రత్యేక సమయంలో దక్షిణ ఒమన్ ప్రత్యేకమైన సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అతిథులకు ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపింది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఒమన్ ఎయిర్ మస్కట్-సలాలా మార్గంలో ఈ సంవత్సరం చివరి వరకు 70,000 అదనపు సీట్లను ప్రకటించింది.
అందుబాటులో ధరలలో, సరసమైన దేశీయ ప్రయాణానికి స్థిర జాతీయ ఛార్జీ విస్తరించిన షెడ్యూల్ అంతటా అందుబాటులో ఉంటుందని ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ఒమన్ పౌరులు జూలై 1 - సెప్టెంబర్ 5 మధ్య ఫ్లాట్ OMR 54 వద్ద ప్రయాణ టిక్కెట్ ను ప్రకటించింది. జాతీయ ఛార్జీల సంఖ్యకు పరిమితి లేదని, అయితే అతిథులు తమ ఇష్టపడే ప్రయాణ తేదీలను పొందేందుకు ముందుగానే బుక్ చేసుకోవాలని తెలిపారు. www.omanair.com ద్వారా బుకింగ్లు చేసుకోవచ్చు. ఒమన్ లోపల నుండి బుక్ చేసుకునే వారికి మాత్రమే జాతీయ ఛార్జీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









