స్వదేశంలో ఉద్రిక్తతలు..యూఏఈలోని ప్రవాసుల్లో ఆందోళనలు..!!
- May 07, 2025
యూఏఈ: పాకిస్థాన్ లోని 9 ప్రాంతాల్లో భారత్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ఈ వార్త యూఏఈలో నిమిషాల్లో వైరల్ అయింది. దాంతో నిద్రలేని రాత్రిని గడిపినట్లు ఇరుదేశాలకు చెందిన ప్రవాసులు తెలిపారు. తమవారి క్షేమాన్ని తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నించారు. మరికొందరు తర్వాత జరుగబోయే వాటిగురించిన చర్చలలో గడిపారు.
“నాకు నిద్ర పట్టలేదు. నా కుటుంబం బాగానే ఉందో లేదో చూడటానికి ప్రతి కొన్ని నిమిషాలకు నేను వార్తల వెబ్సైట్లు, వీడియోలను చూస్తున్నాను. మేము ప్రశాంతమైన ప్రాంతంలో నివసిస్తున్నాము, కానీ క్షిపణులు ఎగురుతున్నప్పుడు, ఏదీ సురక్షితంగా అనిపించదు, ”అని పాకిస్తాన్ పాలిత కాశ్మీర్లోని మీర్పూర్కు చెందిన పాకిస్తానీ ప్రవాసియైన మన్సూర్ ఖాన్ చెప్పాడు. “నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఎవరిది ఒప్పు, తప్పు అనే దానిపై ఆసక్తి లేదు. అందరూ సురక్షితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధం ఎవరికీ ప్రయోజనం కలిగించదు.” అని మరో ప్రవాసుడు తెలిపాడు.
మంగళవారం అర్ధరాత్రి భారతదేశం.. , పాకిస్తాన్ కాశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలపై దాడి చేసింది. 'ఉగ్రవాద మౌలిక సదుపాయాలను' లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని 'యుద్ధ చర్య'గా పేర్కొంది. గత నెలలో పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాడులు కిరాతకంగా చంపిన నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. మిస్సైల్స్ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
"మనకు వేర్వేరు ప్రభుత్వాలు, వేర్వేరు చరిత్రలు ఉండవచ్చు. కానీ రెండు వైపులా ప్రజలు ఒకేలా ఉంటారు. ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. అందరూ శాంతి, భద్రత, సాధారణ జీవితాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. నాకు ఇక్కడ చాలా మంది మంచి పాకిస్తానీ స్నేహితులు ఉన్నారు. ఇది త్వరలో ఆగిపోవాలని మనమందరం ప్రార్థిస్తున్నాము."అని 12 సంవత్సరాలకు పైగా దుబాయ్లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసుడు, అమృత్సర్కు చెందిన ఆర్థిక నిపుణుడు అమర్దీప్ సింగ్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







