ఉద్యోగులకు వృత్తిపరమైన ఫిట్నెస్ పరీక్ష.. MHRSD యోచన..!!
- May 07, 2025
రియాద్: మానవ వనరులు , సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రభుత్వ, ప్రైవేట్ లాభాపేక్షలేని రంగాలలోని ఉద్యోగులకు, అలాగే ఈ రంగాలలో కొత్త ఉద్యోగాలు చేపట్టే వారికి తప్పనిసరి వృత్తిపరమైన ఫిట్నెస్ పరీక్షను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ పరీక్షలు కొన్ని నిర్దిష్ట సందర్భాలలో నిర్వహించబడతాయని తెలిపింది. ఈ నిబంధనలపై అభిప్రాయాలను కోరుతూ ఇస్టిట్లా పబ్లిక్ సర్వే ప్లాట్ఫామ్లో వృత్తిపరమైన ఫిట్నెస్ పరీక్షల కోసం జాతీయ నిబంధనలను మంత్రిత్వ శాఖ ప్రచురించింది.
మూడు రకాల పరీక్షలు ఉంటాయి: సాధారణ వైద్య పరీక్ష, అదనపు ప్రత్యేక పరీక్ష, మానసిక పరీక్ష. ఈ పరీక్షలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. ఉద్యోగులు, కార్మికులు తమ విధులను సమర్థవంతంగా.. సురక్షితంగా నిర్వహించే సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడానికి వారి ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని అంచనా వేయడానికి సమగ్ర చట్రాన్ని అందించడం ఈ నిబంధనల లక్ష్యం. పరీక్షల నిబంధనలు జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. నిబంధనలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, లాభాపేక్షలేని రంగంలోని అన్ని ఉద్యోగులు, కార్మికులకు వర్తిస్తాయి. ఈ నిబంధనలు ఉద్యోగం లేదా వృత్తి పరిధికి వెలుపల ఉన్న వైద్య పరీక్షలకు వర్తించవు.
అధిక-రిస్క్ వృత్తులలో పనిచేసే వారికి ఉద్యోగానికి ముందు వైద్య పరీక్షల కోసం విధానాన్ని తెలిపారు. అందరూ కార్మికుల ఆరోగ్య స్థితిపై సమగ్ర డేటాబేస్లను అందిస్తాయని పేర్కొన్నారు. వృత్తిపరమైన ఫిట్నెస్ కోసం వైద్య పరీక్షను సౌదీ కమిషన్ ఫర్ హెల్త్ స్పెషాలిటీస్ ధృవీకరించిన, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సెక్రటేరియట్లో నమోదు చేయబడిన ఆక్యుపేషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం నిర్వహించాలి. పరీక్ష తర్వాత వృత్తిపరమైన ఫిట్నెస్ అవసరాలు మేరకు ఫలితలు రాకుంటే, కార్మికులు వారి వృత్తిని కొనసాగించకుండా నిషేధిస్తారు. ఆ సందర్భంలో పర్యవేక్షక యాజమాన్యం వారి వృత్తిని మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన 30 రోజులలోపు పరీక్ష ఫలితాలపై అభ్యంతరం చెప్పే హక్కు కార్మికుడు లేదా ఉద్యోగికి ఉంటుంది. ఆక్యుపేషనల్ మెడిసిన్, సంబంధిత స్పెషాలిటీలలో నిపుణులతో కూడిన స్వతంత్ర సమీక్ష కమిటీ, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, 15 రోజుల్లోపు నిర్ణయాన్ని తెలియజేస్తుంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







