అల్ బురైమిలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి..!!
- May 08, 2025
అల్ బురైమి: అల్ బురైమి గవర్నరేట్లోని వ్యవసాయ, నీటి వనరుల డైరెక్టరేట్ జనరల్ ఏప్రిల్ ప్రారంభం నుండి గవర్నరేట్లోని వివిధ విలాయత్లలో గోధుమ పంటలను కోయడం ప్రారంభించింది. ఆహార భద్రతకు మూలస్తంభంగా ఉన్న ఈ కీలకమైన పంట సాగులో గణనీయమైన పెరుగుదల నమోదైంది. మొత్తం ఉత్పత్తి 250 టన్నులకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గవర్నరేట్ అంతటా 200 ఎకరాలకు పైగా గోధుమలను సాగు చేసినట్లు వ్యవసాయ, జల వనరుల డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ నాసర్ అలీ అల్ మార్షౌడి తెలిపారు. అధిక దిగుబడినిచ్చే రకాల నుండి 7,000 కిలోగ్రాములకు పైగా అధిక-నాణ్యత విత్తనాలను ఈ పంటను పండించడానికి ఆసక్తి ఉన్న రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. పంట కాలం కోసం అవసరమైన అన్ని వనరులను అందించడం ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడానికి డైరెక్టరేట్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. "గోధుమ సాగును విస్తరించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. ఎందుకంటే ఈ పంట గవర్నరేట్ ఆహార భద్రతకు ఇది ముఖ్యమైనది." అని ఆయన అన్నారు.
గోధుమ ఉత్పత్తిలో గవర్నరేట్ దూసుకుపోతుందని, వచ్చే సీజన్లో గోధుమ సాగును మరింత విస్తరించాలని డైరెక్టరేట్ యోచిస్తోందని అల్ మార్షౌడి వెల్లడించారు. ఈ కీలక పంట కోసం కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు ప్రణాళికలో ఉన్నాయని, స్థిరమైన దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి స్థానికంగా విత్తనాలను అందుబాటులో పెడుతున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్