అల్ బురైమిలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి..!!
- May 08, 2025
అల్ బురైమి: అల్ బురైమి గవర్నరేట్లోని వ్యవసాయ, నీటి వనరుల డైరెక్టరేట్ జనరల్ ఏప్రిల్ ప్రారంభం నుండి గవర్నరేట్లోని వివిధ విలాయత్లలో గోధుమ పంటలను కోయడం ప్రారంభించింది. ఆహార భద్రతకు మూలస్తంభంగా ఉన్న ఈ కీలకమైన పంట సాగులో గణనీయమైన పెరుగుదల నమోదైంది. మొత్తం ఉత్పత్తి 250 టన్నులకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గవర్నరేట్ అంతటా 200 ఎకరాలకు పైగా గోధుమలను సాగు చేసినట్లు వ్యవసాయ, జల వనరుల డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ నాసర్ అలీ అల్ మార్షౌడి తెలిపారు. అధిక దిగుబడినిచ్చే రకాల నుండి 7,000 కిలోగ్రాములకు పైగా అధిక-నాణ్యత విత్తనాలను ఈ పంటను పండించడానికి ఆసక్తి ఉన్న రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. పంట కాలం కోసం అవసరమైన అన్ని వనరులను అందించడం ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడానికి డైరెక్టరేట్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. "గోధుమ సాగును విస్తరించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. ఎందుకంటే ఈ పంట గవర్నరేట్ ఆహార భద్రతకు ఇది ముఖ్యమైనది." అని ఆయన అన్నారు.
గోధుమ ఉత్పత్తిలో గవర్నరేట్ దూసుకుపోతుందని, వచ్చే సీజన్లో గోధుమ సాగును మరింత విస్తరించాలని డైరెక్టరేట్ యోచిస్తోందని అల్ మార్షౌడి వెల్లడించారు. ఈ కీలక పంట కోసం కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు ప్రణాళికలో ఉన్నాయని, స్థిరమైన దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి స్థానికంగా విత్తనాలను అందుబాటులో పెడుతున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









