భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- May 11, 2025
రియాద్: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ నిర్ణయం శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం రెండు దేశాలకు, వారి ప్రజలకు దీర్ఘకాలిక భద్రత, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగిన రోజుల తర్వాత కాల్పుల విరమణ మంచి పరిణామమని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్లతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









