ఒమన్లోని భారతీయ పాఠశాలల్లో 5వ తరగతి నుండి AI కోర్సులు..!!
- May 11, 2025
మస్కట్: ఒమన్లోని భారతీయ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి ఆధునిక విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సయ్యద్ అహ్మద్ సల్మాన్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, విద్యావేత్తలను భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు, వనరులతో సన్నద్ధం చేయడానికి ఉపయోగపడతాయన్నారు.
2025–27 కాలానికి దాని వ్యూహాత్మక ఎజెండాలో భాగంగా 5వ తరగతి నుండి విద్యార్థుల కోసం ఆర్థిక అక్షరాస్యత, AI (కృత్రిమ మేధస్సు) కోర్సులనును ప్రవేశపెట్టడానికి బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ వారం ఆర్థిక అక్షరాస్యత కోర్సులను ప్రవేశపెడుతుండగా, వేసవి సెలవుల తర్వాత AI పాఠ్యాంశాలు అమలు అవుతాయని తెలిపారు.
ఇండియన్ స్కూల్ మస్కట్ (జిబ్రూ క్యాంపస్), ఇండియన్ స్కూల్ దర్సైట్, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ సుర్, ఇండియన్ స్కూల్ సలాలాలో ప్రధాన ప్రాజెక్టులు జరుగుతున్నాయని, మరిన్ని పాఠశాలలు అభివృద్ధి కోసం సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కమ్యూనిటీ డిమాండ్కు అనుగుణంగా బార్కా, సినావ్లలో కొత్త ఇండియన్ స్కూల్లను స్థాపించడానికి సాధ్యాసాధ్యాల అధ్యయనాలను కూడా బోర్డు ప్రారంభించిందని తెలిపారు.
తాజా వార్తలు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ







