బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభo
- July 09, 2016
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార పండుగ.. బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల పండగను ఆలయ కమిటీ సభ్యులు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శనివారం తొలి రోజు అమ్మవారి ఘట స్థాపనతో బోనాల పండగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు చూ సేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ భవన్ సమీపంలోని అమ్మవారి గుడి నుంచి ప్రారంభమైన ఊరేగింపు డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగింది.అనంతరం తెలంగాణ భవన్లో అమ్మవారి ఘట స్థాపన చేశారు. ఆలయ కమిటీ సలహాదారు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ రెండో రోజు అమ్మవారికి బంగారు, వెండి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. లాల్దర్వాజ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సి.రాజ్కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీలో రెండు రోజుల పాటు సాగుతున్న ఈ సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









