సౌదీ అరేబియా సిటీ బస్ నెట్వర్క్.. క్యూ1లో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి..!!
- May 12, 2025
రియాద్: సౌదీ నగరాల్లోని ప్రభుత్వ బస్సు రవాణా నెటవర్క్ లు 2025 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) విడుదల చేసిన త్రైమాసిక డేటా ప్రకారం.. 15 నగరాల్లో 23 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్యను అధిగమించాయి.
2024 నాల్గవ త్రైమాసికంతో పోలిస్తే Q1 మొత్తం 34% పెరుగుదలను నమోదు చేశాయి. ఇది సిటీ బస్ నెటవర్క్ పై నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. రియాద్లో ప్రయాణికుల సంఖ్య 15 మిలియన్లను దాటగా.. మక్కాలో 4 మిలియన్లకు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదైంది. ఇక మదీనాలో 1.3 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించగా, జెడ్డాలో 1.1 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. తూర్పు ప్రాంతంలో (దమ్మామ్, ఖతీఫ్) 748,000 మందికి పైగా ప్రయాణికులు ప్రభుత్వ బస్సు సేవలను ఉపయోగించారు. ఖాసిమ్లో 193,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించగా, తైఫ్లో 161,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు. జాజాన్లో 104,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







