సౌదీ అరేబియా సిటీ బస్ నెట్వర్క్.. క్యూ1లో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి..!!
- May 12, 2025
రియాద్: సౌదీ నగరాల్లోని ప్రభుత్వ బస్సు రవాణా నెటవర్క్ లు 2025 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) విడుదల చేసిన త్రైమాసిక డేటా ప్రకారం.. 15 నగరాల్లో 23 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్యను అధిగమించాయి.
2024 నాల్గవ త్రైమాసికంతో పోలిస్తే Q1 మొత్తం 34% పెరుగుదలను నమోదు చేశాయి. ఇది సిటీ బస్ నెటవర్క్ పై నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. రియాద్లో ప్రయాణికుల సంఖ్య 15 మిలియన్లను దాటగా.. మక్కాలో 4 మిలియన్లకు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదైంది. ఇక మదీనాలో 1.3 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించగా, జెడ్డాలో 1.1 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. తూర్పు ప్రాంతంలో (దమ్మామ్, ఖతీఫ్) 748,000 మందికి పైగా ప్రయాణికులు ప్రభుత్వ బస్సు సేవలను ఉపయోగించారు. ఖాసిమ్లో 193,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించగా, తైఫ్లో 161,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు. జాజాన్లో 104,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







