సౌదీ అరేబియా సిటీ బస్ నెట్వర్క్.. క్యూ1లో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి..!!
- May 12, 2025
రియాద్: సౌదీ నగరాల్లోని ప్రభుత్వ బస్సు రవాణా నెటవర్క్ లు 2025 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) విడుదల చేసిన త్రైమాసిక డేటా ప్రకారం.. 15 నగరాల్లో 23 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్యను అధిగమించాయి.
2024 నాల్గవ త్రైమాసికంతో పోలిస్తే Q1 మొత్తం 34% పెరుగుదలను నమోదు చేశాయి. ఇది సిటీ బస్ నెటవర్క్ పై నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. రియాద్లో ప్రయాణికుల సంఖ్య 15 మిలియన్లను దాటగా.. మక్కాలో 4 మిలియన్లకు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదైంది. ఇక మదీనాలో 1.3 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించగా, జెడ్డాలో 1.1 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. తూర్పు ప్రాంతంలో (దమ్మామ్, ఖతీఫ్) 748,000 మందికి పైగా ప్రయాణికులు ప్రభుత్వ బస్సు సేవలను ఉపయోగించారు. ఖాసిమ్లో 193,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించగా, తైఫ్లో 161,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు. జాజాన్లో 104,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







