విశాఖ యోగా వేడుకలకు ప్రధాని మోదీ
- May 15, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం మరోసారి జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించనుంది. వచ్చే నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో మేగాయోగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో విశాఖ వేదికగా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘యోగాంధ్ర-2025’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.
దాదాపు 2 లక్షల మంది ప్రజలతో ఈ యోగా వేడుక
ఈ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కేఎస్ విజయానంద్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలతో ఈ యోగా వేడుకను గ్రాండ్గా నిర్వహించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. విశాఖ నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ ఈవెంట్ ద్వారా విశాఖ పేరు మరింత ప్రాచుర్యంలోకి
ఈ యోగా వేడుకకు ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు తమ మద్దతు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా యోగా మీద ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఈవెంట్ ద్వారా విశాఖ పేరు మరింత ప్రాచుర్యంలోకి రానుంది. ఆరోగ్య పరిరక్షణలో యోగాసనాల పాత్రను ప్రాచుర్యం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







