విహారంలో ప్రమాదం..13 మందిని రక్షించిన యూఏఈ నేషనల్ గార్డ్..!!

- May 19, 2025 , by Maagulf
విహారంలో ప్రమాదం..13 మందిని రక్షించిన యూఏఈ నేషనల్ గార్డ్..!!

యూఏఈ: యూఏఈ సముద్ర తీరంలో మునిగిపోతున్నఓ పిక్నిక్ బోట్ నుండి యూఏఈ నేషనల్ గార్డ్ టీమ్ 13 మందిని రక్షించింది. బోట్ ప్రమాదంలో ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, సకాలంలో బాధితులను రెస్క్యూ చేసినట్లు తెలిపింది.  ఈ సందర్భంగా బాధితులను సురక్షితంగా రక్షించేందుక ప్రత్యేక బోట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు.  అంతకుముందు, యేఈ ప్రాంతీయ జలాల్లో ఒక కార్గో నౌక మునిగిపోయిన సంఘటనలో ముగ్గురు ఆసియన్లను రక్షించడానికి నేషనల్ గార్డ్ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది.  అలాగే గతవారం ఒక కార్గో నౌకలో కాలిన గాయాలతో బాధపడుతున్న 50 ఏళ్ల భారతీయుడిని అబుదాబిలోని షేక్ షాఖ్‌బౌట్ మెడికల్ సిటీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com