విహారంలో ప్రమాదం..13 మందిని రక్షించిన యూఏఈ నేషనల్ గార్డ్..!!
- May 19, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర తీరంలో మునిగిపోతున్నఓ పిక్నిక్ బోట్ నుండి యూఏఈ నేషనల్ గార్డ్ టీమ్ 13 మందిని రక్షించింది. బోట్ ప్రమాదంలో ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, సకాలంలో బాధితులను రెస్క్యూ చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా బాధితులను సురక్షితంగా రక్షించేందుక ప్రత్యేక బోట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు, యేఈ ప్రాంతీయ జలాల్లో ఒక కార్గో నౌక మునిగిపోయిన సంఘటనలో ముగ్గురు ఆసియన్లను రక్షించడానికి నేషనల్ గార్డ్ ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించింది. అలాగే గతవారం ఒక కార్గో నౌకలో కాలిన గాయాలతో బాధపడుతున్న 50 ఏళ్ల భారతీయుడిని అబుదాబిలోని షేక్ షాఖ్బౌట్ మెడికల్ సిటీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







