విహారంలో ప్రమాదం..13 మందిని రక్షించిన యూఏఈ నేషనల్ గార్డ్..!!
- May 19, 2025
యూఏఈ: యూఏఈ సముద్ర తీరంలో మునిగిపోతున్నఓ పిక్నిక్ బోట్ నుండి యూఏఈ నేషనల్ గార్డ్ టీమ్ 13 మందిని రక్షించింది. బోట్ ప్రమాదంలో ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, సకాలంలో బాధితులను రెస్క్యూ చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా బాధితులను సురక్షితంగా రక్షించేందుక ప్రత్యేక బోట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు, యేఈ ప్రాంతీయ జలాల్లో ఒక కార్గో నౌక మునిగిపోయిన సంఘటనలో ముగ్గురు ఆసియన్లను రక్షించడానికి నేషనల్ గార్డ్ ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించింది. అలాగే గతవారం ఒక కార్గో నౌకలో కాలిన గాయాలతో బాధపడుతున్న 50 ఏళ్ల భారతీయుడిని అబుదాబిలోని షేక్ షాఖ్బౌట్ మెడికల్ సిటీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







