మంటల్లో చైనా డ్రైవర్లెస్ కారు.. అబుదాబిలో ప్రాజెక్టుపై ప్రభావం ఉంటుందా..?
- May 19, 2025
యూఏఈ: అబుదాబిలో చైనా డ్రైవర్ లెస్ కార్ల ప్రాజెక్టుపై ఇటీవల బీజింగ్ లో జరిగిన ప్రమాదం ఎటువంటి ప్రభావం చూపదని చైనా అటానమస్ వెహికల్ టెక్నాలజీ కంపెనీ Pony.ai తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్తో తమ సహకారాన్ని ఈ సంఘటన ప్రభావితం చేయదని కంపెనీ స్పష్టం చేసింది.
మే 13న బీజింగ్లోని ఆగ్నేయ శివారులోని డాక్సింగ్ జిల్లాలోని యిజువాంగ్ పట్టణంలో Pony.ai సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ వాహనం మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేరని చైనా, యూరప్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం అంతటా పనిచేస్తున్న Pony.ai తెలిపింది.
అక్టోబర్ 2023లో గిటెక్స్ గ్లోబల్ సందర్భంగా మస్దార్ నగరంలో ఉన్న అబుదాబి స్మార్ట్, అటానమస్ వెహికల్స్ ఇండస్ట్రీ (SAVI) క్లస్టర్లో చేరడానికి Pony.ai అబుదాబి స్మార్ట్ , అటానమస్ వెహికల్స్ ఇండస్ట్రీతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. పోనీ.ఐ ప్రస్తుతం బీజింగ్, షాంఘై, గ్వాంగ్జౌలో రోబోటాక్సిస్ను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







