టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- March 07, 2026
రియాద్: షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 16 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా క్షేత్రం వైపు వెళుతుండగా నాలుగు డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు. అనంతరం క్షేత్రంపై జరిగిన మరో దాడి ప్రయత్నంలో మరో ఆరు డ్రోన్లను అడ్డగించి ధ్వంస చేశామని ఆయన చెప్పారు.
ఆ తరువాత షైబా దిశగా వెళ్తున్న మరో నాలుగు డ్రోన్లను ధ్వంసం చేశామని, ఆ తర్వాత మరో రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని అల్-మాలికి చెప్పారు. మరో సంఘటనలో రియాద్ తూర్పున ఒక డ్రోన్ను అడ్డుకున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇరాన్ దాడులను ఎదుర్కొని వాటిని గాలిలోనే ధ్వంసం చేస్తున్నామని అన్నారు. ప్రజలు, నివాసితులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలు, కంటెంట్ ను షేర్ చేయొద్దని అల్-మాలికి సూచించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









