టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- March 07, 2026
రియాద్: షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 16 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా క్షేత్రం వైపు వెళుతుండగా నాలుగు డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు. అనంతరం క్షేత్రంపై జరిగిన మరో దాడి ప్రయత్నంలో మరో ఆరు డ్రోన్లను అడ్డగించి ధ్వంస చేశామని ఆయన చెప్పారు.
ఆ తరువాత షైబా దిశగా వెళ్తున్న మరో నాలుగు డ్రోన్లను ధ్వంసం చేశామని, ఆ తర్వాత మరో రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని అల్-మాలికి చెప్పారు. మరో సంఘటనలో రియాద్ తూర్పున ఒక డ్రోన్ను అడ్డుకున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇరాన్ దాడులను ఎదుర్కొని వాటిని గాలిలోనే ధ్వంసం చేస్తున్నామని అన్నారు. ప్రజలు, నివాసితులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలు, కంటెంట్ ను షేర్ చేయొద్దని అల్-మాలికి సూచించారు.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









