టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- March 07, 2026
రియాద్: షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 16 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా క్షేత్రం వైపు వెళుతుండగా నాలుగు డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు. అనంతరం క్షేత్రంపై జరిగిన మరో దాడి ప్రయత్నంలో మరో ఆరు డ్రోన్లను అడ్డగించి ధ్వంస చేశామని ఆయన చెప్పారు.
ఆ తరువాత షైబా దిశగా వెళ్తున్న మరో నాలుగు డ్రోన్లను ధ్వంసం చేశామని, ఆ తర్వాత మరో రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని అల్-మాలికి చెప్పారు. మరో సంఘటనలో రియాద్ తూర్పున ఒక డ్రోన్ను అడ్డుకున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇరాన్ దాడులను ఎదుర్కొని వాటిని గాలిలోనే ధ్వంసం చేస్తున్నామని అన్నారు. ప్రజలు, నివాసితులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలు, కంటెంట్ ను షేర్ చేయొద్దని అల్-మాలికి సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









