టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- March 07, 2026
రియాద్: షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 16 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా క్షేత్రం వైపు వెళుతుండగా నాలుగు డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు. అనంతరం క్షేత్రంపై జరిగిన మరో దాడి ప్రయత్నంలో మరో ఆరు డ్రోన్లను అడ్డగించి ధ్వంస చేశామని ఆయన చెప్పారు.
ఆ తరువాత షైబా దిశగా వెళ్తున్న మరో నాలుగు డ్రోన్లను ధ్వంసం చేశామని, ఆ తర్వాత మరో రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని అల్-మాలికి చెప్పారు. మరో సంఘటనలో రియాద్ తూర్పున ఒక డ్రోన్ను అడ్డుకున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇరాన్ దాడులను ఎదుర్కొని వాటిని గాలిలోనే ధ్వంసం చేస్తున్నామని అన్నారు. ప్రజలు, నివాసితులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలు, కంటెంట్ ను షేర్ చేయొద్దని అల్-మాలికి సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









