సఖిర్ పర్యావరణ వ్యవస్థ రక్షణ..7,600 టన్నుల వ్యర్థాల తొలగింపు..!!
- May 19, 2025
మనామా: ఉర్బాసర్ క్లీనింగ్ కంపెనీ సహకారంతో దక్షిణ ప్రాంత మునిసిపాలిటీ.. బహ్రెయిన్లోని సఖిర్ ప్రాంతం నుండి సుమారు 7,619 టన్నుల వ్యర్థాలను తొలగించింది. క్యాంపింగ్ సీజన్ ముగిసిన మూడు నెలల తర్వాత చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీ నుంచి తేలికపాటి యంత్రాలు, ట్రక్కులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. క్యాంపింగ్ మెటీరియల్, వదిలివేసిన ఫర్నిచర్, నిర్మాణ శిధిలాలను తొలగించినట్లు తెలిపారు.
సఖిర్ అంతటా క్లీనింగ్ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వచ్చే నెల ప్రారంభం నాటికి క్యాంపెయిన్ ముగిసే అవకాశం ఉందన్నారు. ఇంకా 2,300 టన్నుల వ్యర్థాలను తొలగించాల్సి ఉందని భావిస్తున్నారు. దాంతో మొత్తం వ్యర్థాలు 10,000 టన్నులకు చేరుకునే అవకాశం ఉందని, గత సంవత్సరం క్యాంపింగ్ సీజన్తో పోలిస్తే ఇది 40% పెరుగిందని పేర్కొన్నారు.
బాప్కో ఎనర్జీస్ వంటి జాతీయ సంస్థలతో పాటు BSTS, AMA, ఎనర్ఫ్లెక్స్, NAMCO, MCSC, COMSIP, ASCON, హాలిబర్టన్ వంటి సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా క్లీన్-అప్ డ్రైవ్లు నిర్వహించాయని తెలిపారు. సహజ పర్యావరణ రక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని దక్షిణ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్









