సఖిర్ పర్యావరణ వ్యవస్థ రక్షణ..7,600 టన్నుల వ్యర్థాల తొలగింపు..!!
- May 19, 2025
మనామా: ఉర్బాసర్ క్లీనింగ్ కంపెనీ సహకారంతో దక్షిణ ప్రాంత మునిసిపాలిటీ.. బహ్రెయిన్లోని సఖిర్ ప్రాంతం నుండి సుమారు 7,619 టన్నుల వ్యర్థాలను తొలగించింది. క్యాంపింగ్ సీజన్ ముగిసిన మూడు నెలల తర్వాత చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీ నుంచి తేలికపాటి యంత్రాలు, ట్రక్కులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. క్యాంపింగ్ మెటీరియల్, వదిలివేసిన ఫర్నిచర్, నిర్మాణ శిధిలాలను తొలగించినట్లు తెలిపారు.
సఖిర్ అంతటా క్లీనింగ్ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వచ్చే నెల ప్రారంభం నాటికి క్యాంపెయిన్ ముగిసే అవకాశం ఉందన్నారు. ఇంకా 2,300 టన్నుల వ్యర్థాలను తొలగించాల్సి ఉందని భావిస్తున్నారు. దాంతో మొత్తం వ్యర్థాలు 10,000 టన్నులకు చేరుకునే అవకాశం ఉందని, గత సంవత్సరం క్యాంపింగ్ సీజన్తో పోలిస్తే ఇది 40% పెరుగిందని పేర్కొన్నారు.
బాప్కో ఎనర్జీస్ వంటి జాతీయ సంస్థలతో పాటు BSTS, AMA, ఎనర్ఫ్లెక్స్, NAMCO, MCSC, COMSIP, ASCON, హాలిబర్టన్ వంటి సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా క్లీన్-అప్ డ్రైవ్లు నిర్వహించాయని తెలిపారు. సహజ పర్యావరణ రక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని దక్షిణ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









