ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- March 07, 2026
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీని నియమించారని ఇటీవల కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ సమాచారం నిజం కాదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.
ఇదిలా ఉండగా, కొత్త సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మొజ్తబా ఖమేనీ పేరు ప్రకటిస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన కారణంగా ప్రభుత్వం మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే లీడర్లను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గతంలో కూడా కీలక పదవులు చేపట్టిన కొందరు లీడర్లపై దాడులు జరగడం ఈ భయాలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నాయకత్వ మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









