CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- March 07, 2026
యూఏఈ: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మిడిల్ ఈస్ట్ దేశాలలో 12వ తరగతి విద్యార్థులకు మార్చి 9 నుండి మార్చి 11 వరకు నిర్వంచాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలలోని విద్యార్థులను ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CBSE పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
మార్చి 10న పరిస్థితిని మళ్ళీ సమీక్షిస్తామని, ఆ తర్వాత మార్చి 12 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని CBSE అధికారులు తెలిపారు.
విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్ లో ఉండాలని, మరిన్ని అప్డేట్ ల కోసం CBSE అధికారిక ఛానెల్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







