CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- March 07, 2026
యూఏఈ: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మిడిల్ ఈస్ట్ దేశాలలో 12వ తరగతి విద్యార్థులకు మార్చి 9 నుండి మార్చి 11 వరకు నిర్వంచాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలలోని విద్యార్థులను ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CBSE పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
మార్చి 10న పరిస్థితిని మళ్ళీ సమీక్షిస్తామని, ఆ తర్వాత మార్చి 12 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని CBSE అధికారులు తెలిపారు.
విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్ లో ఉండాలని, మరిన్ని అప్డేట్ ల కోసం CBSE అధికారిక ఛానెల్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









