CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- March 07, 2026
యూఏఈ: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మిడిల్ ఈస్ట్ దేశాలలో 12వ తరగతి విద్యార్థులకు మార్చి 9 నుండి మార్చి 11 వరకు నిర్వంచాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలలోని విద్యార్థులను ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CBSE పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
మార్చి 10న పరిస్థితిని మళ్ళీ సమీక్షిస్తామని, ఆ తర్వాత మార్చి 12 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని CBSE అధికారులు తెలిపారు.
విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్ లో ఉండాలని, మరిన్ని అప్డేట్ ల కోసం CBSE అధికారిక ఛానెల్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









