స్విమ్స్ లో పేషంట్ల సహాయార్థం 'స్విమ్స్ సేవ' ప్రారంభం
- May 19, 2025
తిరుపతి: శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (SWIMS) హాస్పిటల్ ఆధ్వర్యంలో 19.05.2025వ తేది సోమవారం నుండి పేషంట్లు వారి సహాయకులకు త్వరిత గతిన సేవలు అందించాలని ఉద్దేశ్యం తో వారి సహాయార్ధం “స్విమ్స్ సేవను “ప్రారంభించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ...టి.టి.డిలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్ లో కూడా ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఐ.వి.సుబ్బారావు మరియు టి.టి.డి. చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఇ.ఓ. జె.శ్యామలరావు ఆదేశాల మేరకు స్విమ్స్ యూనివర్శిటీలో "స్విమ్స్ సేవ" ప్రారంభించినట్లు తెలిపారు.
స్విమ్స్ హాస్పిటల్ లో అందుతున్న దాదాపు 42 విభాగలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుండి రోజుకు దాదాపు 1500 మంది పేషెంట్ లు వస్తున్నారని, వీరిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వీరికి ఎక్కడ ఏ ఏ వైద్య సేవలు అందుతున్నాయో తెలియడంలేదు.
అందుకోసం పేషెంట్స్ సౌకర్యర్థం స్విమ్స్ నందు విద్యానభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఒక బ్యాచ్ కు 20 మందిని నియమించి వారిని స్విమ్స్ ఓపి.డి బ్లాక్ మరియు శ్రీ పద్మావతి ఓ.పి.డి. బ్లాక్ వద్ద పేషంట్ల ఓ.పి. రిజిస్ట్రేషన్, రక్తపరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం వచ్చే పేషంట్లకు సహాయ సహకారాలు అందిచడం కోసం ఈ సేవను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్, కాలేజ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డా.మాధవి.చీఫ్ మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ వివేకానంద్, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్స్ మురళీ, శిరీష మరియు ఇతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









