ఫుజైరాలో పాదచారుల క్రాసింగ్ల కోసం కొత్త ట్రాఫిక్ ప్రణాళిక..!!
- May 20, 2025
యూఏఈ: ఎమిరేట్ పోలీసులు ప్రకటించిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఎమిరేట్ అంతటా కొత్త పాదచారుల క్రాసింగ్లను ఏర్పాటు చేయడానికి ఫుజైరా పోలీసులు ఒక ప్రణాళికను ఆవిష్కరించారు.వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్, ప్రజా భద్రతను మెరుగుపరచడానికి, అదే సమయంలో రన్-ఓవర్ ప్రమాదాలను తగ్గించడానికి, అలాగే కొత్త పాదచారుల క్రాసింగ్లను ఏర్పాటు చేయనున్నారు.
యూఏఈలో జైవాకింగ్ అనేది ఫెడరల్ ట్రాఫిక్, రోడ్ చట్టంలోని ఆర్టికల్ 89 ప్రకారం.. Dh400 జరిమానాతో శిక్ష విధించే అవకాశం ఉంది. అత్యంత ప్రమాదకరమైన పాదచారుల క్రాసింగ్లను తిరిగి రూపొందించడం ఈ ప్రణాళిక లక్ష్యం అని ఫుజైరా పోలీస్ జనరల్ కమాండ్లోని ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ధహ్నహాని అన్నారు.
మే నెల ప్రారంభంలో ఫుజైరా పోలీస్ జనరల్ కమాండ్ 2025 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా "పాదచారులకు సురక్షితంగా దాటే హక్కు ఉంది" అనే నినాదంతో ఒక నెల క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్రైవర్లు, పాదచారులకు అవగాహన కల్పించారు. పాదచారులు క్రాసింగ్లను ఉపయోగించడం, ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర ప్రవర్తనలను నివారించడం అనే సంస్కృతిని ప్రోత్సహిస్తుందని పోలీసు అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
యూఏఈ రోడ్లను సురక్షితంగా మార్చడం, నిర్లక్ష్యం లేదా అసురక్షిత వైఖరి వల్ల కలిగే ట్రాఫిక్ మరణాలు, గాయాలను తగ్గించడం అనే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక దృక్పథానికి ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుందని ఫుజైరా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









