విశాఖలో 5లక్షల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
- May 21, 2025
అమరావతి: విశాఖపట్నం ప్రధాన వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. జూన్ 21న నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానుండటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు ‘యోగా మాసం’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే అని అన్నారు.
జూన్ 21న యోగా డే ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, యోగాకి ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని చంద్రబాబు అన్నారు. వచ్చే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకుంటున్నామని, ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలకు యోగా ఒక నాంది. ప్రతిఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని సూచించారు. యోగా వల్ల పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
ఇవాళ్టి నుంచి జూన్ 21వ తేదీ వరకు ఏపీలో యోగాంధ్ర జరుపుకోవాలని, జూన్ 21వ తేదీన విశాఖలో ఐదు లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖ సాగరతీరంలో ఆరోజు ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు యోగా డే జరుగుతుందని చెప్పారు. అందరికి ఆరోగ్యం, ఆనందం యోగా వల్ల కలుగుతుందని, ప్రతి మనిషిలో యోగా వల్ల ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుందని, ప్రతి మనిషి రోజుకు ఒక గంట యోగా చేయడం అలవాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. యోగా వల్ల మనిషిలో శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









