కేటీఆర్ చొరవతో మలేసియా జైలు నుంచి విడుదల..
- May 22, 2025
హైదరాబాద్: మలేసియాలో జైలు పాలైన తెలంగాణ వాసులు..భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో విడుదలై బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్ భారాస నేత భూక్యా జాన్సన్నాయక్తో కలిసి బుధవారం నందినగర్లోని నివాసంలో కేటీఆర్ను బాధితులు, వారి కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వారిని కేటీఆర్ అనునయించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్కు చెందిన ఆరుగురు ఉపాధి కోసం గత సంవత్సరం మలేసియాకు వెళ్లారు. అక్కడ ఓ కేసులో అరెస్టయ్యారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో.. ఆయన తమ పార్టీ నేత జాన్సన్ నాయక్తో మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు. కేటీఆర్ సూచనతో మార్చిలో మలేసియా వెళ్లిన జాన్సన్.. జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ను కలిశారు.అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారని తెలుసుకున్న జాన్సన్..సొంత నిధులతో స్థానిక న్యాయవాదులను నియమించి.. న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూశారు. మే 12న మలేసియాకు మళ్లీ వెళ్లి.. అక్కడి కోర్టు విధించిన జరిమానా చెల్లించి, వారిని స్వదేశానికి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









