కేటీఆర్ చొరవతో మలేసియా జైలు నుంచి విడుదల..
- May 22, 2025
హైదరాబాద్: మలేసియాలో జైలు పాలైన తెలంగాణ వాసులు..భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో విడుదలై బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్ భారాస నేత భూక్యా జాన్సన్నాయక్తో కలిసి బుధవారం నందినగర్లోని నివాసంలో కేటీఆర్ను బాధితులు, వారి కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వారిని కేటీఆర్ అనునయించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్కు చెందిన ఆరుగురు ఉపాధి కోసం గత సంవత్సరం మలేసియాకు వెళ్లారు. అక్కడ ఓ కేసులో అరెస్టయ్యారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో.. ఆయన తమ పార్టీ నేత జాన్సన్ నాయక్తో మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు. కేటీఆర్ సూచనతో మార్చిలో మలేసియా వెళ్లిన జాన్సన్.. జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ను కలిశారు.అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారని తెలుసుకున్న జాన్సన్..సొంత నిధులతో స్థానిక న్యాయవాదులను నియమించి.. న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూశారు. మే 12న మలేసియాకు మళ్లీ వెళ్లి.. అక్కడి కోర్టు విధించిన జరిమానా చెల్లించి, వారిని స్వదేశానికి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







