మలేషియా మాస్టర్స్: క్వార్టర్స్ కు శ్రీకాంత్..
- May 22, 2025
కౌలాలంపూర్: భారత సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. ప్రపంచ ర్యాంకింగ్లో 33వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ ఆటగాడు నాట్ గ్వెన్పై శ్రీకాంత్ 59 నిమిషాల పాటు జరిగిన పోరులో 23-21, 21-17 తేడాతో విజయం సాధించాడు.శ్రీకాంత్ తన తదుపరి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన తోమా పోపోవ్ను ఎదుర్కోనున్నాడు.
ఇదిలా ఉండగా, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు హెచ్.ఎస్. ప్రణయ్… జపాన్కు చెందిన యుషి తనాకా చేతిలో 9-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. అదే విధంగా అయుష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్ కూడా తమ మ్యాచ్లలో వరుస గేముల్లోనే పరాజయాన్ని చవిచూశారు.
అయుష్ శెట్టి ఫ్రాన్స్ ఆటగాడు తోమా పోపోవ్ చేతిలో 13-21, 17-21తో ఓడగా, సతీష్ కుమార్ కరుణాకరన్ క్రిస్టో పోపోవ్ చేతిలో 14-21, 16-21తో ఓడిపోయాడు.
మహిళల డబుల్స్లో ప్రేరణ ఆల్వేకర్ – మృణ్మయీ దేశ్పాండే జోడీ..తైవాన్కు చెందిన హ్సూ యిన్ హుయ్ – లిన్ ఝిహ్ యున్ జోడీ చేతిలో 9-21, 14-21తో ఓటమి పాలైంది.
మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత జోడీ ధ్రువ్ కపిలా–తనీషా క్రాస్టో 21-17, 18-21, 21-15తో ఫ్రాన్స్కు చెందిన జూలియన్ మాయో – లియా పలెర్మోపై విజయం సాధించింది. వారు తదుపరి రౌండ్లో చైనా జోడీ జియాంగ్ జెన్ బాంగ్, వే యా షిన్ను ఎదుర్కొంటారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







