యూఎస్ వెళ్ళే పౌరులకి బహ్రెయిన్, యూఏఈ హెచ్చరిక
- July 11, 2016
అమెరికాకి వెళ్ళే తమ పౌరులకు బహ్రెయిన్, యూఏఈ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాలో నల్లజాతీయుల దాడులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళే పౌరులు అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్, యూఏఈ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. వాషింగ్టన్లోని యూఏఈ ఎంబసీ 'స్పెషల్ అలర్ట్'ని జారీ చేసింది. ఆందోళనా కార్యక్రమాలకు తమ పౌరులు దూరంగా ఉండాలని ఈ అలర్ట్లో పేర్కొన్నారు. బహ్రెయిన్, ట్విట్టర్ ద్వారా తమ పౌరులను అలర్ట్ చేసింది. ఆందోళనలు, ప్రదర్శనలు, అలాగే ఎక్కువమంది గుమికూడే ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్ తన పౌరులకు సూచించింది. 37 ఏళ్ళ నల్లజాతీయుడు అల్టన్ స్టెర్లింగ్ ఓ పోలీస్ చేతిలో బాటన్ రోగ్, లూసియానాలో చనిపోయాక అమెరికాలో అల్లర్లు పెరిగాయి. ఫిలాండో కాస్టిల్లోని మిన్నెసోటాలో పనిచేస్తున్న ఓ నల్లజాతి యువకుడ్ని సైతం పోలీసులు కాల్చి చంపడంతో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







