యూఎస్‌ వెళ్ళే పౌరులకి బహ్రెయిన్‌, యూఏఈ హెచ్చరిక

- July 11, 2016 , by Maagulf
యూఎస్‌ వెళ్ళే పౌరులకి బహ్రెయిన్‌, యూఏఈ హెచ్చరిక

అమెరికాకి వెళ్ళే తమ పౌరులకు బహ్రెయిన్‌, యూఏఈ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాలో నల్లజాతీయుల దాడులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళే పౌరులు అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్‌, యూఏఈ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. వాషింగ్టన్‌లోని యూఏఈ ఎంబసీ 'స్పెషల్‌ అలర్ట్‌'ని జారీ చేసింది. ఆందోళనా కార్యక్రమాలకు తమ పౌరులు దూరంగా ఉండాలని ఈ అలర్ట్‌లో పేర్కొన్నారు. బహ్రెయిన్‌, ట్విట్టర్‌ ద్వారా తమ పౌరులను అలర్ట్‌ చేసింది. ఆందోళనలు, ప్రదర్శనలు, అలాగే ఎక్కువమంది గుమికూడే ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని బహ్రెయిన్‌ తన పౌరులకు సూచించింది. 37 ఏళ్ళ నల్లజాతీయుడు అల్టన్‌ స్టెర్లింగ్‌ ఓ పోలీస్‌ చేతిలో బాటన్‌ రోగ్‌, లూసియానాలో చనిపోయాక అమెరికాలో అల్లర్లు పెరిగాయి. ఫిలాండో కాస్టిల్‌లోని మిన్నెసోటాలో పనిచేస్తున్న ఓ నల్లజాతి యువకుడ్ని సైతం పోలీసులు కాల్చి చంపడంతో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com