ఒమన్ పర్యటనకు చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

- May 26, 2025 , by Maagulf
ఒమన్ పర్యటనకు చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

మస్కట్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉపప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్నారు. ఆయనతోపాటు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా ఈ పర్యటనలో భాగమైంది.

ఈ పర్యటనలో షేక్ హందాన్, ఒమన్ సుల్తాన్ మరియు ప్రధానమంత్రి హైథమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకార మార్గాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.

విమానాశ్రయంలో షేక్ హందాన్ కు ఒమన్ సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి సయీద్ తయ్యజిన్ బిన్ హైథమ్ తారిఖ్ అల్ సయీద్ స్వాగతం పలికారు.

ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా మైలురాయిగా భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com