కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- December 17, 2025
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు స్థాయి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ. 30 లక్షల కనీస ధరతో మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన వేలంలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ 14.20 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.
అతడితో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రశాంత్ వీర్ ను కూడా సీఎస్కే 14.20 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పొందిన అన్క్యాప్డ్ ఆటగాళ్లలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
ఇక ఈ మొత్తం సొంతం చేసుకోవడం పట్ల కార్తీక్ శర్మ స్పందించాడు.వేలం ప్రారంభమైనప్పుడు తాను అవకాశాన్ని కోల్పోతానేమో, తన కోసం ఎవ్వరూ బిడ్ వేయరని అనుకున్నట్లు చెప్పాడు.
అయితే.. ఒక్కసారి బిడ్ వేసాక అది పెరుగుతూ వెలుతున్నప్పుడూ తాను ఏడవడం మొదలుపెట్టినట్లు అతడు చెప్పుకొచ్చాడు. ఇక తనను సీఎస్కే దక్కించుకున్న తరువాత కూడా భావోద్వేగంతో, ఆనందంతో తాను ఏడుస్తూను ఉన్నానన్నాడు. తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నానన్నాడు.
తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదన్నాడు. వారందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక తనకు లభించిన దాని పట్ల కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉందన్నాడు. అందరూ సంబురాలు చేసుకుంటున్నారన్నాడు. ఇక దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







